- వారాసిగూడ చికెన్ షాప్ లో పట్టుకున్న పోలీసులు
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ పరిధిలో ఫ్రెష్ చికెన్ పేరుతో.. కుళ్లిపోయిన చికెన్ను అమ్ముతున్న ఓ హోటల్పై పోలీసులు దాడి చేసి 610 కిలోల కుళ్లిన మాంసాన్ని సీజ్చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ లోని వారాసిగూడ పీఎస్ పరిధిలో షేక్ షకీల్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఏ1 ఫ్రెష్ చికెన్పేరుతో మార్ట్ నిర్వహిస్తున్నాడు.
ఇక్కడి నుంచి రోజూ వందల సంఖ్యలో కస్టమర్లు చికెన్ కొంటారు. దీంతోపాటు జోన్ పరిధిలోని వివిధ హోటళ్లకు, రెస్టారెంట్లకు షకీల్ భారీగా చికెన్ ను సప్లయ్ చేస్తాడు. ఈషాప్లో పాడైపోయిన చికెన్ను అమ్ముతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారాసిగూడ సీఐ, ఎస్ఐ మంగళవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు చికెన్ మార్ట్లో తనిఖీలు నిర్వహించారు.
అపరిశుభ్రమైన ఫ్రీజర్లలో, బొద్దింకలు, ఎలుకలు తిరిగే ప్రాంతంలో చికెన్ నిల్వ ఉన్నట్టు గుర్తించారు. ఆ చికెన్పూర్తిగా కుళ్లిపోయి, బూజుపట్టి, కంపు కొడుతుండగా.. పోలీసులు వెంటనే దాన్ని సీజ్ చేశారు. సదరు దుకాణానికి ట్రేడ్ లైసెన్స్ కూడా కిందటి ఏడాది గడువు ముగిసింది. అయినా రిన్యూవల్ చేయకుండానే కొనసాగిస్తున్నట్టు బయటపడింది. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల్లో వారాసిగూడ ఇన్స్పెక్టర్ జి. రాజేందర్ గౌడ్, ఎస్ఐ కె. రామచంద్ర రెడ్డి సిబ్బంది పాల్గొనగా.. డీసీపీ కె. రక్షిత కృష్ణ మూర్తి, ఏసీపీ కె. శశాంక్ రెడ్డి పర్యవేక్షించారు.
