ఎయిర్ పోర్టు సమీపంలో 280 కిలోల గంజాయి పట్టివేత

ఎయిర్ పోర్టు సమీపంలో 280 కిలోల గంజాయి పట్టివేత

కృష్ణా  జిల్లా  గన్నవరం ఎయిర్ పోర్టు  సమీపంలో 280 కిలోల గంజాయి పట్టుబడింది. విమానాశ్రయం సమీపంలోని  పొట్టిపాడు  టోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్  పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న 280 కిలోల  గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. టెంపో బస్సులో 240 కిలోలు, ఆర్టీసీ బస్సులో 40 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఒక మహిళతో  సహా 12 మంది నిందితులను  అరెస్ట్ చేసి, గన్నవరం పోలీస్ స్టేషన్  కు  తరలించారు.