944.7 కిలోల గంజాయి పట్టివేత

944.7 కిలోల గంజాయి పట్టివేత

హైదరాబాద్, వెలుగు: గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్న లారీని డీఆర్ ఐ అధికారులు పట్టుకున్నారు. కొబ్బరి బోండాల లోడ్ తో ఎల్బీనగర్ వైపు వస్తున్న కార్గో లారీలో 944.7 కిలోల గంజాయి పట్టుబడింది. భద్రాచలం నుంచి హైదరాబాద్ కు గంజాయి స్మగ్లింగ్ అవుతోందన్న సమాచారంతో డీఆర్​ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. కొబ్బరి బోండాల లోడ్ తో వస్తున్న లారీని తనిఖీ చేయగా.. గంజాయి బయటపడింది. గంజాయి, లారీని స్వాధీనం చేసుకొని, డ్రైవర్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దీని విలువ రూ.1.89 కోట్లు ఉంటుందని  హైదరాబాద్ అదనపు డీజీ డీపీ నాయుడు తెలిపారు.