హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ అవినీతి, వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ స్టార్ట్చేసిన వినూత్న ప్రచార రథాలు ‘బీఆర్ఎస్ వైఫల్యాల కార్ల’ను పోలీసులు సీజ్చేశారు. శనివారం రాత్రి పార్టీ నేతలు, సిబ్బంది అంతా వెళ్లిపోయాక ఎవరూ లేని సమయంలో పోలీసులొచ్చి వాటిని సీజ్చేశారు. అనంతరం వాటిని స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే, దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
పోలీసులు దౌర్జన్యంగా వాహనాలను తీసుకెళ్లారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్రెడ్డి ఆరోపించారు. పోలీసులు బీఆర్ఎస్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. వెంటనే వాహనాలను తిరిగి గాంధీభవన్లో అప్పగించాలని డిమాండ్చేశారు. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టేలా ఆ పార్టీ గుర్తు అయిన కారుపైనే వాటిని రాసి ప్రజలకు తెలియజెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా గులాబీ రంగు కార్లను తయారు చేయించి, వాటిని శుక్రవారం ప్రారంభించింది. వాటిపై కేసీఆర్ వైఫల్యాలను వివరించింది. పోలీసులు తాజాగా వాటిని సీజ్ చేశారు.