కొన్నె గ్రామంలో ఆరు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

కొన్నె గ్రామంలో ఆరు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

బచ్చన్నపేట,వెలుగు: ఓవ్యక్తి అక్రమంగా ఆరు క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యం తరలిస్తుండగా బుధవారం బచ్చన్నపేట పోలీసలు పట్టుకున్నారు. బచ్చన్నపేట ఎస్సై సతీశ్​ ​ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ కేసు  విషయమై  పోలీసులు కొన్నె గ్రామానికి వెళ్లి వస్తుండగా.. టాటా సుమోలో  పీడీఎస్ బియ్యం లోడుతో  ఎదురు పడింది. అనుమానంతో హెడ్​ కానిస్టేబుల్​ నర్సిరెడ్డి తనిఖీ చేయగా ఆరు క్వింటాళ్ల బియ్యం ఉన్నాయి.

వాహనాన్ని పోలీస్టేషన్​కు తరలించారు. బియ్యం రవాణా చేస్తున్న వ్యక్తి సిద్దిపేట జిల్లా గజ్వెల్​ మండలం వట్టిపల్లి గ్రామానికి గగులోత్​ శంకర్​గా గుర్తించారు. బియ్యం స్వాధీనం చేసుకొని   శంకర్​ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.