
ఎల్లారెడ్డిపేట, వెలుగు: దావత్ చేసుకుందామని ప్రాణస్నేహితుడే నమ్మించి తీసుకెళ్లి యువకుడిని కొట్టి చంపిన కేసును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఛేదించారు. సోమవారం హత్య కేసు వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన మెండే సతీశ్యాదవ్ (33), నర్మాల పవన్ కుమార్, భీమయ్యగారి రాజశేఖర్ ముగ్గురూ ఫ్రెండ్స్. కాగా వీరు సుతారి పనిచేసేవారు. ఖాళీ టైమ్లో సోషల్ మీడియాలో రీల్స్ చేసేవారు. ఇది కాస్త వీరి మధ్య గొడవలకు దారితీసింది. గత శుక్రవారం సతీశ్ యాదవ్ను పవన్ కుమార్ దావత్ చేసుకుందామని లింగన్నపేట శివారుకు తీసుకెళ్లాడు.
అక్కడ ఇద్దరూ మద్యం తాగారు. ఆపై వీరి మధ్య మాట మాట పెరిగి గొడవ జరిగింది. దీంతో పవన్ కుమార్ తన బంధువుల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నాడని భీమయ్యగారి రాజశేఖర్కు ఫోన్లో చెప్పాడు. అతడు.. సతీశ్ను చంపివేయమని తెలపడంతో వెంటనే పవన్ కుమార్ తన చేతిలోని బీర్ బాటిల్తో సతీశ్తల, మెడపై కొట్టి చంపాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నిందితులు పవన్ కుమార్, రాజశేఖర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేసును ఛేదించిన గంభీరావుపేట ఎస్ఐ ప్రేమానందం, ఎల్లారెడ్డి పేట ఎస్ఐ రమాకాంత్ను సీఐ అభినందించారు.