లష్కర్ బోనాల రాజకీయ వివాదం

లష్కర్ బోనాల రాజకీయ వివాదం

హైదరాబాద్: ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర లో రాజకీయ వివాదం దుమారం రేపుతోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రోటోకాల్  అమలు చేయకుండా బీజేపీ నేతలను అవమానిస్తున్నారంటూ బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , లోకల్ కార్పొరేటర్ సుచరిత శ్రీకాంత్ ఫోటోలు పెట్టకుండా పోస్టర్ రిలీజ్ చేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పోస్టర్ పై టీఆర్ఎస్ మాజీ కార్పరేటర్ ఫోటో పెట్టారని బీజేపి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎండోమెంట్ కమిషనర్ కు రాంగోపాల్ పేట్ బిజెపి కార్పొరేటర్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే బీజేపీ ప్రజాప్రతినిధులను అవమానపరుస్తుందని ఆయన ఆరోపించారు.