నేనిచ్చే వినాయక విగ్రహమే పెట్టాలె.. పోటీ పడుతున్న లీడర్లు 

నేనిచ్చే వినాయక విగ్రహమే పెట్టాలె.. పోటీ పడుతున్న లీడర్లు 

ఎన్నికల వేళ వినాయక విగ్రహాలు ఇచ్చేందుకు నేతలు పోటీ పడుతున్నరు. నేనంటే నేనే ఇస్తానంటూ పంతాలకు పోతున్నారు. నల్గొండ  హనుమాన్​నగర్​లో  ఏటా పెద్ద గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సారి అక్కడ విగ్రహం ఇచ్చేందుకు బీఆర్​ఎస్, కాంగ్రెస్, రెబల్​ నేతలు పోటీ పడ్డారు. దీంతో డ్రా తీయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్​ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్​ పేర్లతో డ్రా తీశారు. ఇందులో ఎంపీ వెంకటరెడ్డి పేరు వచ్చింది. ఇంకేముంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేకు చిర్రెత్తింది.

అసలు డ్రా ఎవడు తీయమన్నాడంటూ ఉత్సవ కమిటీపై చిందులు వేశారట. ఎవరొచ్చి పూజలు చేస్తారో చూస్తానంటూ వార్నింగ్​ ఇచ్చారట. కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ అధికారులు అక్కడ అడుగుపెడతానికి వీళ్లే దని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇదిలా ఉంటే విగ్రహాలు ఫ్రీగా వస్తుండడంతో నల్గొండ టౌన్​లో ఈ సారి ప్రతి 30 ఇండ్లకు ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ALSO READ: టీచర్ల ప్రమోషన్లకు టెట్ ఎఫెక్ట్.. సీనియర్లు దూరమయ్యే చాన్స్ 

ఎంపీ వెంకటరెడ్డి 9 ఫీట్ల విగ్రహాలు పంచుతుంటే.. ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి పది ఫీట్ల విగ్రహాలు ఇస్తున్నారు. తానేం తక్కువ కాదన్నట్టు అసమ్మతి నేత పిల్లి రామరాజు ఏకంగా 11 ఫీట్ల విగ్రహాలు ఇస్తుండటం హాట్​టాపిక్​గా మారింది. ఇక మండపాల పక్కన పొలిటికల్ లీడర్ల బొమ్మలతో పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.