అధికారంలోకొస్తే పంజాబ్కు పూర్వవైభవం

అధికారంలోకొస్తే పంజాబ్కు పూర్వవైభవం

చండీఘడ్: గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని అన్నారు. తాను సీఎం అయినా కళ్లు నెత్తికెక్కించుకోనని, సాధారణ వ్యక్తిలాగే ఉంటానని చెప్పారు. ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ముఖ్యమంత్రి అయ్యాక కూడా తానెప్పటికీ ప్రజల మధ్యనే ఉంటానని భగవంత్ మాన్ స్పష్టం చేశారు. సీఎం అయిన తర్వాత కూడా తన జీవన శైలిలో ఎలాంటి మార్పు రాదని, కొత్త జీవితం వచ్చిందని ఫీల్ అవ్వనని అన్నారు. ప్రజలు పాత పంజాబ్ను కోరుకుంటున్నారే తప్ప రాష్ట్రాన్ని పారిస్, లండన్, కాలిఫోర్నియా చేయాలని కోరుకోవడం లేదని అభిప్రాయపడ్డారు.ఆప్ అధికారం చేపడితే పంజాబ్కు పునర్వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

For more news..

ఓట్ల లెక్కింపుపై ఈసీకి సమాజ్వాదీ పార్టీ లేఖ

ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన పాక్ యువతి