న్యూఢిల్లీ: ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో పోలింగ్సమయంలో మార్పులు చేయాలంటూ ఈసీకి సుప్రీంకోర్టు సూచించింది. లోక్సభ ఎన్నికల్లో మిగతా దశల పోలింగ్ను తెల్లవారుజామున ఐదింటికే ప్రారంభించాలని పేర్కొంది. ఎండలతో పాటు ముస్లింల పవిత్ర మాసం రంజాన్నేపథ్యంలో అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అడ్వొకేట్మహమ్మద్నిజాముద్దీన్పాషా, అసద్హయత్దాఖలు చేసిన రిట్పిటిషన్ విచారించిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ సూచన చేసింది.