హైదరాబాద్, వెలుగు : ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లను ఖండిస్తున్నట్లు బీజేపీ తమిళనాడు కో ఇన్ చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ అసూయతో నిరాధారమైన విమర్శలు చేస్తున్నారని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రధాని మోదీ మోదీ హయాంలో మన దేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేటీఆర్ నుంచి బీజేపీకి ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ సర్కార్ తొమ్మిదేండ్లుగా నెరవేర్చలేదని తెలిపారు. సుపరిపాలన అందిస్తున్న ప్రధానిని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం లక్షల కోట్ల నిధులు ఇస్తున్నదన్నారు.