రాహుల్ సభను విజయవంతం చేయండి

రాహుల్ సభను విజయవంతం చేయండి

కరీంనగర్: ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాలను అణిచివేసిన చంద్రబాబును మించి నియంత కేసీఆర్ అని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హుజురాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... ఓయూలో రాహుల్ పర్యటనకు పర్మిషన్ ఇవ్వడంలేదని, విద్యార్థులతో మాట్లాడేందుకు వెళ్తామంటే పర్మిషన్ ఇవ్వరా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేస్తూ... కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ నెల 6న హన్మకొండలోని అర్ట్స్ కాలేజీలో జరిగే రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా రానున్నారని, రైతుల గురించి ఆయన మాట్లాడతారన్నారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ... మంత్రి పదవి తన కాలి చెప్పుతో సమానమన్న కేటీఆర్ మెడలో చెప్పుల దండ వేయాలన్నారు. కేసీఆర్ కుటుంబం నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థుల ఆత్మహత్యలకు చలించిపోయి సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే... కేసీఆర్ మాత్రం విద్యార్థులను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. వరంగల్ లో జరిగే రాహుల్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తల కోసం...

ఓయూలో రాహుల్ సభకు అనుమతి నిరాకరణ

బండారం బయటపడుతుందనే రాహుల్ పర్యటనకు అడ్డంకులు