కేసీఆర్, కేటీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్

కేసీఆర్, కేటీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ లు శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని అన్నారు. తెలంగాణాలో చేనేత వృత్తిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని, ఆత్మహత్యలు వద్దు, కార్మికులు ముద్దు అనే నినాదంతో సమస్యల మీద పోరాధామని అన్నారు.17 సంవత్సరాలుగా బీఆర్ఎస్ చేసిందేమీ లేదని అన్నారు.

చేనేత కార్మికుల సమస్యలపై చర్చించటానికి తానూ ఎక్కడైనా సిద్ధమని అన్నారు. బతుకమ్మ చీరల పెండింగ్ బిల్లులు 50కోట్లు విడుదల చేశామని అన్నారు. జీవో నంబర్ 1ద్వారా చేనేతలు నేసిన బట్టలు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ వాదాన్ని అవహేళన చేశారని, కిషన్ రెడ్డికి సంస్కృతి తెలీదని, ఆయన మోడీ అపాయింట్ చేసిన వ్యక్తి అని మండి పడ్డారు. మోడీ దేశ సంపద అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నారని, శవరాజకీయాలు చేస్తున్నారని అన్నారు పొన్నం ప్రభాకర్