రిజర్వేషన్ల జోలికి వస్తే దేశం రావణ కాష్టమే: పొన్నం

రిజర్వేషన్ల జోలికి వస్తే దేశం రావణ కాష్టమే: పొన్నం

రిజర్వేషన్ల జోలికి వస్తే దేశం రావణ కాష్టం అవుతుందని హెచ్చరించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన దేశంలో ఇప్పటకీ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు.

నిజంగా రిజర్వేషన్లు పై సమీక్షలు చేయాలంటే..ఆర్థిక అసమానతలు లేని వ్యవస్థను రూపొందించాలని సూచించారు. బీజేపీ ఇష్టం వచ్చినట్లు ప్రతీ అంశంలో వేలు పెడదామని ప్రయత్నిస్తే ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు. బీజేపీ అంటేనే వ్యాపారస్థుల పార్టీ అని విమర్శించారు.

రిజర్వేషన్ల అంశం ఇప్పటిది కాదని..దేశానికి స్వాతంత్రం రాకముందే ఉందన్నారు. మోడీ కూడా  BC నేత అని చెప్పుకునే ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ప్రధాన మంత్రి అయ్యారన్నారు. తెలంగాణ నుంచి బీజేపీ గెలిచిన ఎంపీల్లో ఇద్దరు BCలు, ఒక ST ఉన్నారన్న పొన్నం… వారు దీనిపై స్పందించాలన్నారు.