టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరే జట్లను తేల్చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. రెండు ఫైనల్ బెర్తులను భారత్, ఆస్ట్రేలియా దక్కించుకుంటాయని జోస్యం చెప్పాడు. ఫైనల్ చేరాలంటే..ఆట ఉంటే సరిపోదని..కొద్దిగా లక్ కూడా ఉండాలన్నాడు. టీ20 వరల్డ్ కప్ లో మాత్రం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఫేవరెట్లని చెప్పుకొచ్చాడు.
ఇంగ్లాండ్ సూపర్...
వన్డేలు, టీ20ల్లో ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడుతోందని పాంటింగ్ అన్నాడు. అందుకు ఆ జట్టు టీ20 వరల్డ్ కప్ లో ఫేవరెట్ అని చెప్పాడు. ముఖ్యంగా టీమ్ కోచ్ మాథ్యూ మోట్ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ బలంగా తయారైందన్నాడు. అతను గతంలో ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ కు కోచ్ గా వ్యవహరించాడని..అతని కోచింగ్ లోనే ఆ జట్టు టీ20ప్రపంచకప్ గెలిచిందని గుర్తు చేశాడు.
Former Australia captain #RickyPonting has predicted that India and Australia will be the two teams making the finals of the upcoming #T20WorldCuphttps://t.co/uFxnthrQ3y
— CricketNDTV (@CricketNDTV) July 26, 2022
ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత్..
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు భారత్, ఆసీస్ జట్లు వెళ్తాయన్నాడు పాంటింగ్. ఫైనల్లో భారత్ను ఆసీస్ ఓడించి...టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. హోం గ్రౌండ్ లో ఆడటం ఆసీస్ కు కలిసొస్తుందన్నాడు. అటు భారత్ కు ఫైనల్ చేరే అవకాశాలున్నాయని పాంటింగ్ చెప్పాడు. మొత్తంగా టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియా జట్లు పేపర్ మీద చాలా బలంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ మూడు జట్లకు సూపర్ క్లాస్ ప్లేయర్లు., మ్యాచ్ విన్నర్లు ఉన్నారని చెప్పారు.