అభిమానిని ఇంట్లోకి పిిలిచి మర్యాద చేసిన పూజాహెగ్డే
తమ ఎదుగుదలకి, విజయానికి అభిమానులే కారణమని హీరో హీరోయిన్లు చెబుతుంటారు. వాళ్లు ఫ్యాన్స్కి ఎంతవరకు అందుబాటులో ఉంటారో తెలియదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం తమ ఫేవరేట్ యాక్టర్స్ కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతారు. అలాంటి ఒక ఫ్యాన్ తగిలాడు పూజా హెగ్డేకి. అతడి అభిమానం చూసి ఆశ్చర్యపోయిందామె. భాస్కరరావు అనే ఒక అభిమాని పూజని కలవడం కోసం ముంబైకి వెళ్లాడు. ఐదు రోజుల పాటు ఆమె ఇంటి ముందే ఉండిపోయాడు. కలిసే అవకాశం రాకపోవడంతో ఇంటి ముందున్న ఫుట్పాత్పైనే తిన్నాడు, పడుకున్నాడు. ఎట్టకేలకి ఈ విషయం పూజకి తెలిసింది. వెంటనే లోపలికి పిలిచి మర్యాద చేసింది. అయితే ఇంకోసారి ఇలాంటివి చేయొద్దని కాస్త గట్టిగానే చెప్పింది. ‘నా అభిమానులు ఇలా ఇబ్బంది పడితే నేను తట్టుకోలేను. అందులోనూ నాకోసం వాళ్లు అలా చేయడం నాకు మరింత బాధ కలిగిస్తుంది. మీరెక్కడున్నా మీ ప్రేమని, అభిమానాన్ని నేను పొందుతూనే ఉంటాను. మీరే నా బలం. సోషల్ మీడియాలో చిన్న మెసేజ్ పెట్టినా చాలు.. స్పందిస్తాను. అంతేకానీ ఇలాంటి పనులు మాత్రం ఎవరూ చేయొద్దు’ అంటూ తన ఫ్యాన్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేసింది పూజ. అతడి అభిమానికి తాను ఫిదా అయిపోవడమే కాదు, అతడిని ఇంట్లోకి పిలిచి మర్యాద చేసి పంపించి అందరినీ ఫిదా చేసేసింది . ఆ వీడియో వైరల్ కావడంతో ఆమెను నెటిజన్స్ ఎంతో ప్రశంసిస్తున్నారు.