వడదెబ్బతో పోస్టుమ్యాన్ మృతి

వడదెబ్బతో పోస్టుమ్యాన్ మృతి

హుస్నాబాద్, వెలుగు: వడదెబ్బతో ఓ పోస్టుమ్యాన్ మృతిచెందాడు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఈ ఘటన జరిగింది. హుస్నాబాద్ లోని పోస్ట్ ఆఫీసులో గూళ్ల ఎల్లయ్య (52) పోస్ట్ మ్యాన్ గా పని చేస్తున్నాడు. గత మూడు రోజులుగా ఎండలోనే లెటర్లు పంచుతున్నాడు. సోమవారం ఆయన అస్వస్థతకు లోనయ్యాడు. కుటుంబ సభ్యులు రెస్ట్ తీసుకోవాలని సూచించినా వినకుండా ఆఫీసుకు వెళ్లాడు.

గంట సేపు లెటర్లు పంచాడు. ఈ క్రమంలోనే ఇంటి సమీపంలో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే చికిత్స కోసం ఆయనను హుస్నాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వడదెబ్బ తగిలిందని నిర్ధారించిన డాక్టర్లు చికిత్స మొదలుపెట్టారు. కండిషన్ సీరియస్ గా ఉండటంతో సిద్దిపేటకు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11 గంటలకు మరణించాడు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక నాయకులు కోరుతున్నారు.