టపాసులు పడి కోళ్ల ఫామ్ దగ్ధం..1200 కోళ్లు మృతి

టపాసులు పడి కోళ్ల ఫామ్ దగ్ధం..1200 కోళ్లు మృతి

తూర్పుగోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పిఠాపురం మండలంలో లక్ష్మీ నర్సాపురంలో  దీపావళి సందర్భంగా కాల్చిన టపాసులు  కోళ్ల ఫామ్ పై పడటంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో  దాదాపు 1200 కోళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాదం గురించి తెలిసిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వచ్చి మంటలను అర్పేశారు. అప్పటికే కోళ్ల ఫామ్ కాలిపోయింది.  4 లక్షలకు పైగా నష్టం జరగవచ్చని యజమాని అంచనా వేశారు. పండగ పూట నష్టం జరిగిందని ఆవేదన చెందాడు.

కరోనా పంజా.. 13 లక్షలు దాటిన మరణాలు

టీ20 టోర్నమెంట్ ను ఆపేందుకు కిరణ్ బేడీ ప్లాన్

సరిహద్దులో జవాన్ల దీపావళి వేడుకలు