ఇయ్యాల దమ్మాయిగూడలో కరెంట్ నిలిపివేత

 ఇయ్యాల దమ్మాయిగూడలో కరెంట్ నిలిపివేత

కీసర, వెలుగు:  దమ్మాయిగూడ ఫీడర్ పరిధిలోని పలు కాలనీల్లో శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏఈ శ్రీనివాస్‌‌‌‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమయంలో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను కత్తిరించడం, ఫీడర్‌‌‌‌‌‌‌‌ నిర్వహణ పనులు చేపడతామన్నారు.

దమ్మాయిగూడ గ్రామం, కార్మిక నగర్, సత్యనారాయణ కాలనీ, లక్ష్మీ నగర్, అంజనాద్రి కాలనీ, ఎమ్మెల్యే కాలనీ సీఎంఆర్ ఎల్ఎస్ఆర్, వీఎన్ఎస్ కాలనీ, సాయి శ్రీనివాస్, వీఆర్ఆర్, లేక్‌‌‌‌వ్యూ, గ్రీన్ పార్క్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.  బ్యాంక్ కాలనీ ఫీడర్ పనుల కారణంగా రాజిరెడ్డి నగర్, లక్ష్మీ నగర్ పొడిగింపు, బాల్ రెడ్డి, పీఎస్ రావు నగర్, జవహర్ నగర్, అంబేద్కర్ నగర్, బీజేఆర్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌, కాప్రా మున్సిపాలిటీలోని సాయిరాం, సాకేత్ కాలనీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని తెలిపారు.