- కొన్ని గంటలపాటు కరెంట్ కట్
- ట్రాన్స్ ఫార్మర్ షార్ట్ సర్క్యూట్
- కరెంట్ లేక విడుదల కాని జీవోలు
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్ కు సోమవారం కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం నుంచే బీఆర్కే భవన్ లో కరెంట్ సప్లై బంద్ అయిందని ఉద్యోగులు తెలిపారు. విద్యుత్ లోడ్ పెరగడంతో కరెంట్ సరఫరా చేసే ట్రాన్స్ ఫార్మర్ షార్ట్ సర్య్కూట్ కావటంతో ఈ సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సరైన వెలుతురు లేక సెక్రటేరియెట్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ కూడా పోవడంతో పని ఆగిపోయిందని పలువురు ఉద్యోగులు చెప్పారు. లిఫ్ట్ లు కూడా పనిచేయకపోవటంతో ఇబ్బంది అయిందని చెబుతున్నారు. కరెంట్ ప్రభావంతో సోమవారం ఒక్క జీవో కూడా విడుదల కాలేదు. మధ్యాహ్నం కల్లా కరెంట్ సరఫరా చేస్తామని చెప్పినప్పటికీ, కరెంట్ రాలేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లిన తర్వాత కరెంట్ వచ్చినట్లు చెబుతున్నారు.