నాంపల్లి కోర్టుకు ప్రభాకర్ రావు

నాంపల్లి కోర్టుకు ప్రభాకర్ రావు
  • నేడు సిట్‌‌‌‌ ముందు విచారణకు హాజరుకానున్న ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌ 
  • ..ఎన్‌‌‌‌బీడబ్ల్యూ, ప్రొక్లెమేషన్‌‌‌‌ రీకాల్ చేసుకునే యత్నం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రావు మంగళవారం నాంపల్లి కోర్టుకు వెళ్లాడు. ఇప్పటికే తనపై జారీ అయిన నాన్‌‌‌‌ బెయిలబుల్‌‌‌‌ వారెంట్‌‌‌‌, ప్రొక్లెమేషన్‌‌‌‌ నోటీసులను రీకాల్‌‌‌‌ చేయించుకునేందుకు కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు విచారణ జరుగుతున్న 14వ అడిషనల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌‌‌‌లో పిటిషన్‌‌‌‌ దాఖలు చేయాలనుకున్నారు. ఐతే జడ్జి సెలవుల్లో ఉండడంతో తిరిగి వెళ్లిపోయారు. ప్రొక్లెమేషన్‌‌‌‌ నోటీస్‌‌‌‌ గడువు ఈ నెల 20 తేదీ వరకు ఉండడంతో మరోసారి కోర్టుకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది.

అరెస్ట్‌‌‌‌ చేయకుండా విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయనపై ఉన్న లుక్ అవుట్‌‌‌‌ సర్క్యులర్, రెడ్‌‌‌‌ కార్నర్ నోటీసులు రద్దు అయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్‌‌‌‌బీడబ్ల్యూ, ప్రొక్లెమేషన్‌‌‌‌ నోటీసును కూడా రీకాల్‌‌‌‌ చేసుకునేందుకు కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. మరోవైపు సిట్‌‌‌‌ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రభాకర్ రావు విచారణకు హాజరుకానున్నారు.