భారత చిత్ర సీమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే టక్కున గుర్తొచ్చేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రభాస్ పెళ్లి న్యూస్ ఎప్పుడు వింటామని దేశ వ్యాప్తంగా అభిమానులు, సెలబ్రిటీలు ఎదురుచూస్తున్నారు. అతనికి భార్యగా ఎవరు వస్తారో అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్ క్రిటిక్ బాలీవుడ్ ఫేమస్ క్రిటిక్ ఉమైర్ సంధూ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. ప్రభాస్ తర్వలో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ అతను ట్విట్టర్లో రివీల్ చేశాడు. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రభాస్ మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోనున్నాడని వెల్లడించాడు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు.
నిజం లేదు..
ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్మెంట్ వార్తలపై ప్రభాస్ టీం స్పందించింది. ఉమైర్ సంధు కథనాల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. ప్రభాస్, కృతి సనన్ నిశ్చితార్థ వార్తల్లో వాస్తవం లేదని..కొందరి ఉత్సాహం మాత్రమే అని చెప్పుకొచ్చింది. అటు ప్రభాస్ సహనటుడు, స్నేహితులు కూడా ఈ వార్తలను కొట్టిపారేశారు.
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రం తెరకెక్కుతోంది. రామాయణం కథ ఆధారంగా ఈ మూవీ రాబోతుంది. ఇందులో సీత పాత్రలో కృతి, రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఎప్పుడైతే ఆదిపురుష్ మూవీ సెట్స్పైకి వెళ్లిందో.. అప్పటి నుంచి ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలపై కృతి సనన్ గతంలోనే స్పందించింది. అందులో నిజం లేదని... గాసిప్స్ మాత్రమే అని కొట్టిపారేసింది.