- సికింద్రాబాద్ను స్వర్గంలా మారుస్త
- ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్
సికింద్రాబాద్, వెలుగు : తనను ముఖ్యమంత్రిని చేస్తే సికింద్రాబాద్నియోజకవర్గాన్ని స్వర్గంలా మారుస్తానని ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. సోమవారం ఆయన తుకారాం గేట్ రైల్వేస్టేషన్ ఏరియాలోని మాంగర్బస్తీలో పర్యటించారు. అక్కడున్న సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పాల్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ పేరిట ప్రజలను సీఎం కేసీఆర్ పదేండ్లుగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో లోని ఒక్క అంశం కూడా నెరవేర్చదగినదిగా లేదని తెలిపారు.