సీఎం కేసీఆర్  జైలుకెళ్లడం ఖాయం

సీఎం కేసీఆర్  జైలుకెళ్లడం ఖాయం
  • ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ పాల్

హైదరాబాద్, వెలుగు : “కేసీఆర్ జైలు కెళ్లడం ఖాయం. ఆయన చేసిన అవినీతిపై సీబీఐ డైరెక్టర్​కు ఫిర్యాదు చేశా. రాష్ట్రాన్ని దోచుకున్నది సరిపోక దేశాన్ని దోచుకునేందుకు కేసీఆర్ బయల్దేరిండు. కేటీఆర్​ను సీఎం చేసి బీఆర్ఎస్ పేరుతో దేశ రాజకీయాలు చేస్తడంట. మీరు అనుకున్నది జరగదు” అని ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్​ కేఏ పాల్ విమర్శించారు. శనివారం అమీర్ పేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంలో రూ.లక్షా5 వేల కోట్లు, యాదాద్రిలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై అన్ని ఆధారాలను  సీబీఐ డైరెక్టర్ జైస్వాల్​కు అందజేశానని తెలిపారు. రాష్ర్టం వచ్చాక కేసీఆర్, ఆయన కుటుంబం, పక్కనున్నోళ్లు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు. టీఆర్ఎస్ అంటే తోడు దొంగల రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ భారత బడాచోర్ రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు.