చలో సెక్రటేరియట్ : ఇందిరాపార్క్ దగ్గర ప్రతిపక్షాల నిరసన

చలో సెక్రటేరియట్ : ఇందిరాపార్క్ దగ్గర ప్రతిపక్షాల నిరసన

ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ నిరసన కార్యక్రమం హైదరాబాద్ ఇందిరాపార్క్ లో మొదలైంది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అద్దంకి దయాకర్, ఇందిరా శోభన్, టీజేఎస్ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర్ రావు ఇతర నాయకులు ఇందిరాపార్క్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ప్రజాధనం వేస్ట్ చేస్తున్నారనీ… కనీసం 50 ఏళ్లు పనిచేసే సెక్రటేరియట్ ను కూల్చాల్సిన అవసరం లేదని నాయకులు అన్నారు. కాసేపట్లో సెక్రటేరియట్ వరకు ర్యాలీగా బయల్దేరి వెళ్లనున్నారు.