
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్రావు, 15 మంది సాక్షులు శనివారం సిట్ ముందు హాజరయ్యారు. సిట్ అధికారులు అందించిన ఫోన్ నంబర్ల ఆధారంగా సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. తమ వ్యక్తిగత రహస్యాలు తమ ప్రమేయం లేకుండానే బయటకెళ్లిన విషయాలను వెల్లడించారు.
ఇప్పటికే 100 మందికి పైగా సాక్షుల నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరించారు. ప్రణీత్ను ఐదు గంటలు ప్రశ్నించారు. మళ్లీ సోమవారం హాజరుకావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు కూడా సోమవారం సిట్ ముందు హాజరుకానున్నారు.