ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో  హైకోర్టును ఆశ్రయించాడు నిందితుడు  ప్రణీత్‌ రావు.  పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్  చేస్తూ  హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు ప్రణీత్ రావు తరఫు న్యాయవాది.  వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కిందికోర్టు కస్టడీకి ఇచ్చిందని  పిటిషన్ లో తెలిపారు.  కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని ఆరోపించారు.  విచారణ తర్వాత రాత్రి వేళల్లో పీఎస్‌ లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని పిటీషన్‌లో పేర్కొన్నారు ప్రణీత్ రావు. 

 విచారణ పూర్తైన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో కోరారు ప్రణీత్‌ రావు.  దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారన్న ప్రణీత్ రావు..  ఎందుకు లీక్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమేనన్నారు . రహస్యంగా  బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారని..  బంధువులు, న్యాయవాదిని కూడా అనుమతించడం లేదని తెలిపారు.  విచారణలో  ఏఎస్పీ రమేశ్ పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు.  ఇప్పటికే సమాచారం అందించినందున కస్టడీ రద్దు చేయాలని కోరారు.  ప్రణీత్‌ రావు కస్టడీపై పోలీసుల వివరణ కోరుతూ విచారణను మార్చి 20కి  వాయిదా వేసిది హైకోర్టు.