ఇడియట్ రోజులు గుర్తొచ్చాయి : ప్రశాంత్ వర్మ

ఇడియట్ రోజులు గుర్తొచ్చాయి : ప్రశాంత్ వర్మ

రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సినిమా ‘మిస్టర్ ఇడియట్’. సిమ్రాన్ శ‌‌‌‌‌‌‌‌ర్మ హీరోయిన్. ‘పెళ్లి సందడి’ ఫేమ్ గౌరీ రోణింకి దర్శకత్వంలో జె జె ఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘రవితేజ గారు ఇండస్ట్రీలో ఎంతోమందిని ఎంకరేజ్ చేశారు.  నన్ను కూడా ఆయనే ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు  మాధవ్‌‌‌‌‌‌‌‌ను సపోర్ట్ చేయడం నా బాధ్యతగా భావించాను. ‘మిస్టర్ ఇడియట్’ టైటిల్  చెప్పగానే నాకు ‘ఇడియట్’ సినిమా  రోజులు గుర్తొచ్చాయి.

 అందులో హీరోయిజం కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. మాధవ్ కూడా రవితేజ గారి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నా’ అని టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పాడు. హీరో మాధవ్ మాట్లాడుతూ ‘ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. హీరోగా పరిచయమవుతున్న నన్ను ఆదరిస్తారని  కోరుకుంటున్నా’ అని చెప్పాడు.  ఈ సినిమాలో వర్క్ చేయడం బ్యూటీఫుల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ ఇచ్చిందని హీరోయిన్ సిమ్రాన్ శర్మ చెప్పింది. ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు  రీచ్ అయ్యే అంశాలతో ఈ మూవీ రూపొందించానని డైరెక్టర్ గౌరీ అన్నారు. నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమా రిలీజ్‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నామని నిర్మాత రవిచంద్ చెప్పారు.  మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సహా టీమ్ అంతా  పాల్గొన్నారు.