బీజేపీతో కలిసి నితీశ్​ ఎక్కువ కాలం నిలవదు : ప్రశాంత్​ కిశోర్​

బీజేపీతో కలిసి నితీశ్​ ఎక్కువ కాలం నిలవదు :  ప్రశాంత్​ కిశోర్​

పాట్నా: బీజేపీతో కలిసి నితీశ్​ ఏర్పాటు చేసిన కొత్త కూటమి ఎక్కువ కాలం నిలవదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ ​కిశోర్ జోస్యం చెప్పారు. ‘నితీశ్ ఎప్పుడైనా జంప్​ కావొచ్చని  నేను మొదటి నుంచి చెబుతున్నా. మారడం ఆయన రాజకీయాల్లో భాగం. ఆయనో ‘పాల్తుమార్’. ఒక్క నితీశ్ మాత్రమే కాదు.. బీజేపీతో పాటు ఇతర ప్రతి నాయకుడు ఒక ‘పాల్తుమార్’ అని రుజువైంది. నిన్న మొన్నటి వరకు అనేక సమస్యలపై నితీశ్​ను నిందించిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ ఆయనకు స్వాగతం పలుకుతున్నారు’ అని విమర్శించారు.​ 2025లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ  ఎన్నికల వరకు కూడా బీజేపీ- జేడీయూ కూటమి స్థిరంగా ఉండదన్నారు. బిహార్‌‌లో ఎన్‌‌డీఏ కూటమి ప్రభుత్వం ఒక ఏడాది లేదా దాని కంటే తక్కువే కొనసాగుతుందని తెలిపారు.