కాళేశ్వరం ద్వారా పంటలకు సమృద్ధిగా నీరు: మంత్రి ప్రశాంత్​రెడ్డి

కాళేశ్వరం ద్వారా పంటలకు సమృద్ధిగా నీరు: మంత్రి ప్రశాంత్​రెడ్డి

నిజామాబాద్, వెలుగు: వానాకాలం పంటల సాగు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, కాళేశ్వరం ప్రాజెక్ట్​ ద్వారా సాగుకు నీరందిస్తామని మంత్రి ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్​లో ఉమ్మడి జిల్లా ఇరిగేషన్​ ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్​ కింద సాగు చేసే పంటలకు ఈ సీజన్​లో 50 టీఎంసీల నీరు అవసరం కాగా, 20 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉందన్నారు. మిగతా 30 టీఎంసీలను రోజుకు 0.5 టీఎంసీల చొప్పున కాళేశ్వరం నుంచి లిఫ్ట్​చేయడానికి పంపుహౌస్​లను సిద్ధం చేయాలని సీఈ సుధాకర్​రెడ్డిని మంత్రి ఆదేశించారు.

 నిజాంసాగర్​ప్రాజెక్ట్​లోని 5 టీఎంసీలను వానాకాలం పంటలకు అందించేలా ప్లాన్ రూపొందించి, విడుదల చేయాలని సీఈ శ్రీనివాస్​రెడ్డికి చెప్పారు. గుత్పా, అలీసాగర్, లక్ష్మీకెనాల్, చౌట్​పల్లి హన్మంత్​రెడ్డి లిఫ్టులను కాకతీయ కెనాల్​ఆయకట్టుకు కావాల్సిన సాగునీటి ప్రణాళికను రూపొందించాలని సీఈ మధుసూదన్​కి సూచించారు.