
భారత్ కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ షాక్ ఇచ్చాడు. భారత్ కు ఇన్నాళ్లు కల్పించిన ప్రాధాన్యత వాణిజ్య హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నెల 5వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్రోగ్రామ్ నుంచి భారత్ ను తొలగిస్తానని గతంలోనే ప్రకటించాడు ట్రంప్. ప్రాధాన్యత వాణిజ్య హోదా కింద ఇన్నాళ్లూ.. భారత వస్తువులకు అమెరికాలో ప్రత్యేక పన్నులు ఉండేవి కావు. అయితే అమెరికా వస్తువులకు ఇండియా మార్కెట్లో సమాన హోదా ఇచ్చే అంశంపై భారత్ ఎలాంటి హామీ ఇవ్వలేదని, అందుకే ఈ హోదా రద్దు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.