ప్రేమించి పెళ్లిచేసుకుంటానని నమ్మించి యువతిని గర్భవతిని చేసి ఓ యువకుడు పరారయ్యాడు. ఈ ఘటన ఎల్బీనగర్లో జరిగింది. స్థానికంగా నివసించే రాజేష్ అనే యువకుడు గతంలో నల్గొండ జిల్లా కోదాడలో బీటెక్ చదివాడు. ఆ సమయంలో తనతో చదివే యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. పెళ్లికి ముందే యువతి గర్భవతి కావడంతో.. రాజేష్ ఆమెను ఎల్బీనగర్లోని హెల్త్ కేర్ ఆస్పత్రికి తీసుకొచ్చి అబార్షన్ చేయించాడు. అయితే ఆస్పత్రి వైద్యులు అబార్షన్ చేసిన సమయంలో యువతి గర్భసంచిని కూడా తొలగించారు. దాంతో యువతి ఆరోగ్యం విషమించింది. వెంటనే మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రులను సంప్రదించకుండా.. అబార్షన్ ఎలా చేస్తారని యువతి తల్లిదండ్రులు వైద్యులను నిలదీశారు. ప్రేమ పేరుతో మోసం చేసిన రాజేష్, అబార్షన్ చేసిన వైద్యుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని యువతి బంధువులు ఆస్పత్రి ముందు భైఠాయించారు. విషయం తెలిసిన స్థానిక పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకొని తల్లిదండ్రుల ఫిర్యాదుతో రాజేష్పై 376 (2) (n), 493, 417, 313, r/w 34 IPC & Sec 3(2) (v) SC, ST, POA Act సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
For More News..