హైదరాబాద్ అత్తాపూర్ లో విషాదం: గర్భిణి ప్రాణం తీసిన కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆర్టీసీ బస్సు కింద పడి..

హైదరాబాద్ అత్తాపూర్ లో విషాదం: గర్భిణి ప్రాణం తీసిన కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆర్టీసీ బస్సు కింద పడి..

హైదరాబాద్ అత్తాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలయ్యింది. గురువారం ( జూన్ 19 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నంబర్ 198 దగ్గర హైవేపై జరిగిన ప్రమాదంలో సయ్యద్ ఆశ్ర అనే గర్భిణి మృతి చెందింది. హైవేపై నిర్లక్ష్యంగా కారు పార్క్ చేసి డోర్ తెరిచి పెట్టడంతో ఆర్టీసీ బస్సు కింద పడి గర్భిణి మృతి చెందింది.

ఆశ్రపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం, రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై కారును నిర్లక్ష్యంగా ఆపి డోర్ తెరవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు స్థానికులు. 

ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.సర్వీస్ రోడ్లలో ఆక్రమ పార్కింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారూ స్థానికులు. డ్రైవర్ నిర్లక్ష్యానికి అన్యాయంగా నిండు గర్భిణి బలయ్యిందని.. ఈ దారుణానికి కారణమైన డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.