ప్రభుదేవా హీరోగా శంకర్ దర్శకత్వంలో 30 ఏళ్ల క్రితం ట్రెండ్ సెట్టర్గా నిలిచిన చిత్రం ‘ప్రేమికుడు’. ఇప్పటికీ ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ చిత్రాన్ని నిర్మాతలు రమణ, మురళీధర్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్కు ప్రసన్నకుమార్, రామ సత్యనారాయణ, దర్శకులు ముప్పలనేని శివ, శివ నాగు, నిర్మాతలు శోభారాణి హాజరయ్యారు.
రీ రిలీజ్లో కూడా ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు రావాలని కోరారు. త్వరలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహిస్తామని నిర్మాతలు చెప్పారు. నగ్మా హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని కేజీ కుంజుమన్ నిర్మించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు.