సెప్టెంబరు 17న లండన్‌కు ద్రౌపది ముర్ము

సెప్టెంబరు 17న లండన్‌కు ద్రౌపది ముర్ము

క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు.  సెప్టెంబరు 17న ఆమె లండన్‌కు వెళ్తారు. 19న ఎలిజబెత్ అంత్యక్రియలు జరుగుతాయి. భారత ప్రభుత్వం తరపున  ఎలిజబెత్ 2అంత్యక్రియల్లో పాల్గొని  సంతాపాన్ని తెలియజేయనున్నారు.  ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

క్వీన్ ఎలిజబెత్ 2  మృతి పట్ల  సంతాప సూచకంగా  భారతదేశం సెప్టెంబర్ 11న జాతీయ సంతాప దినాన్ని పాటించింది. 1926లో జన్మించిన ఎలిజబెత్‌-2 సెప్టెంబర్ 8న మరణించారు. బ్రిటన్ ను 70 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన రాణిగా ఎలిజబెత్ 2 గుర్తింపు పొందారు.

బ్రిటన్‌లో అర్థశతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో ఎలిజబెత్‌ 2కి అధికారులు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.