శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు. కుటుంబ సమేతంగా నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి… ఉదయం ఇస్తికఫార్ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు. తర్వాత ప్రారంభ దర్శన సమయంలో శ్రీనివాసుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు రాష్ట్రపతి. ఆయన వెంట గవర్నర్ నరసింహన్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు.

దర్శనాంతరం రాష్ట్రపతి దంపతులకు వేదాశీర్వచనం అందించారు పండితులు. మధ్యాహ్నం 3గంటలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో శ్రీహరికోటకు వెళ్తారు. తెల్లవారుజామున చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగాన్ని చూస్తారు. ఆ తర్వాత తిరిగి తిరుపతి చేరుకుని… అక్కడ్నుంచి ఢిల్లీ వెళ్తారు.