సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ మాది ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సభలో మందకృష్ణ మాదిగను ప్రధాని మోదీ ఆలింగనం చేసుకోవడంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. మందకృష్ణ మాదిగను భుజం తట్టి ప్రధాని మోదీ ఓదార్చారు.
విశ్వ రూపం మహాసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పండుగ సమయంలో మనకు కావాల్సిన వారిమధ్యలోకి ఉండటం నాకు సంతోషంగా ఉంది.. అందుకే నేను రెట్టింపు ఉత్సాహంగా ఉన్నాను.. ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసిన మందకృష్ణ మాదిగకు నా శుభాకాంక్షలు అన్నారు. మా ప్రభుత్వ తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన.. అణగారిన వర్గాలకు అండగా బీజేపీ ఉంటుందన్నారు మోదీ. సామాజిక న్యాయం కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. 30 యేళ్లుగా మందకృష్ణ మాదిక ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు.. వన్ లైన్.. వన్ మిషన్ గా మందకృష్ణ పోరాడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ మాదిగల బాధను అర్థం చేసుకోలేదన్నారు ప్రధాని. మాదిగలకు నేను తోడుగా ఉంటారు.. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తామన్నారు ప్రధాని మోదీ.