అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేశాయి: మోదీ

అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేశాయి: మోదీ

రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేశాయన్నారు ప్రధాని మోదీ. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి సీఎం కుర్చీని కేసీఆర్ కబ్జా చేశారని విమర్శించారు. దళితులకు మూడుకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి..ఇవ్వకుండా మోసం చేశాన్నారు. దళితబంధు ఎంతమందికి వచ్చిందో  ఆలోచించాలన్నారు. అవకాశ వాద రాజకీయాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రధాని. కాంగ్రెస్, బీఆర్ ఎస్ లు దళిత విద్రోహ పార్టీలుని అని అన్నారు. అంబేద్కర్ ను వ్యతిరేకించి ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు ప్రధాని మోదీ. సెంట్రల్ హాల్ లో అంబేద్కర్ చిత్ర పటాన్ని పెట్టనివ్వలేదన్నారు. ఇకపై మాదిగలు ఏమీ అడగాల్సిన పనిలేదన్నారు మోదీ.దళితుడైన రామ్ నాథ్ కోవింద్ ను  రాష్ట్రపతిని చేశామన్నారు.. దళితుడిని రాష్ట్రపతి చేయడం కాంగ్రెస్ కు ఇష్టం లేదన్నారు ప్రధాని. అదివాసీ మహిళను రాష్ట్రపతిని చేశామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.