8న కేబినెట్ విస్తరణ.. కొత్తగా 20 మందికి చాన్స్!

8న కేబినెట్ విస్తరణ.. కొత్తగా 20 మందికి చాన్స్!

ఈ నెల 8న కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. 20 మందికి పైగా కొత్తవారికి కేబినెట్ లో చొటు దక్కే చాన్స్ ఉందని  ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశముందని భావిస్తున్నవారు ఢిల్లీ వస్తున్నారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్, మధ్యప్రదేశ్ కు చెందిన నేత జ్యోతిరాధిత్య సింధియా, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే, LJP నాయకుడు పశుపతి కుమార్ పరాస్, JDU నేతలు RCP సింగ్, లల్లన్ సింగ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన రీటా బహుగుణా జోషీ, పంకజ్ చౌధరీ, అనుప్రియా పటేల్, రామ శంకర్ కతేరియా, వరుణ్ గాంధీ, రాజస్థాన్ కు చెందిన చంద్రప్రకాశ్ జోషీ, రాహుల్ కాసవాన్ లకు కేబినెట్ లో చోటు దక్కే అవకాశముందని భావిస్తున్నారు. వీరిలో కొందరు ఢిల్లీలోనే ఉండగా... మిగతావారు ఢిల్లీ వస్తున్నారు.