పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి

పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి

పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.  ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం మియాపూర్ లోఈ ఘటన జరిగింది. మక్కా చేనులో పనులు పూర్తి చేసుకొని తిరిగి ఇళ్లకు వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న బేతి లక్ష్మీ(52), మల్యాల వైష్ణవి(31), పోచంపల్లి రాజమ్మ (54) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా చిన్న బొకూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు.