వీడియో: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్‌కు నివాళులు అర్పించిన ప్రధాని

వీడియో: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్‌కు నివాళులు అర్పించిన ప్రధాని

సర్ధార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. భారతదేశానికి తొలి హోంమంత్రిగా పనిచేసిన పటేల్ విగ్రహానికి పూలమాల వేశారు. సర్దార్ పటేల్ జయంతిని 2014 నుంచి ‘రాష్ట్రీయ ఏక్తా దివాస్’ భారత ప్రభుత్వం జరుపుతుంది.

ప్రధాని మోడీ ప్రస్తుతం రెండురోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో రెండో రోజైన శనివారం ఉదయం మోడీ.. నర్మదా జిల్లాలోని కెవాడియా వద్ద ఉన్న 182 మీటర్ల పటేల్ విగ్రహం వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. అదే సమయంలో పటేల్ విగ్రహంపై హెలికాప్టర్లు గులాబీ రేకులు వర్షం కురిపించాయి.

ఆ తర్వాత మోడీ పరేడ్ మైదానానికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ‘జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ’ నిర్వహించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో మోడీ శుక్రవారం కొత్త పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆరోగ్యా వాన్, ఏక్తా మాల్, చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్క్, సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్ లేదా జంగిల్ సఫారి మరియు బోట్ రైడ్ వంటి కొన్ని ప్రధాన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.

For More News..

రాష్ట్రంలో కొత్తగా 1,445 కరోనా కేసులు

టీ20ల్లో వెయ్యి సిక్సర్లు కొట్టిన ఫస్ట్‌‌ క్రికెటర్

మహిళల భద్రతకు ‘ మేరీ సహేలి’