
ఇప్పుడు మాస్కులకు గిరాకీ బాగా పెరిగింది. కొన్ని చోట్ల వాటి కొరత కూడా ఉంది. దీంతో మధ్యప్రదేశ్లోని ఖైదీలు మాస్కులు తయారు చేసే పనిలో పడ్డారు. జబల్పూర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ సెంట్రల్జైలులో శిక్ష అనుభవిస్తున్న 50 మంది ఖైదీలు 2 వేల మాస్కులను సిద్ధం చేశారు. వాటన్నింటినీ రాష్ట్ర సర్కారుకు అందించనున్నారు.