మియాపూర్ లో యూటర్న్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటుండగా ప్రైవేట్ బస్సు బోల్తా... పలువురికి గాయాలు, 

మియాపూర్ లో యూటర్న్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటుండగా ప్రైవేట్ బస్సు బోల్తా... పలువురికి గాయాలు, 
  • ఒకరి పరిస్థితి విషమం

మియాపూర్, వెలుగు: ఉద్యోగులను ఎక్కించుకుని కంపెనీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు యూటర్న్ తీసుకుంటూ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ఫార్మా కంపెనీ ఉద్యోగులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. లీ ఫార్మా కంపెనీకి చెందిన ప్రైవేటు బస్సు కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలోని కేపీహెచ్‌‌‌‌‌‌‌‌బీ నుంచి 10 మంది ఉద్యోగులతో మియాపూర్ మీదుగా గడ్డపోతారం ఇండస్ట్రియల్ ఏరియా వైపు వెళ్తోంది. 

ఈ క్రమంలో బాచుపల్లి రోడ్డులోని టాటా మోటర్స్ సమీపానికి చేరుకున్నప్పుడు యూటర్న్​ తీసుకుంటుండగా బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో ఉన్న పలువురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా మారింది. వీరిని సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ను నియంత్రించారు. బోల్తా పడిన బస్సును క్రేన్ సాయంతో తొలగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.