- కాలువలో దూకిన అంజలి.. అనాథలైన ఇద్దరు పిల్లలు
హాలియా, వెలుగు: ఉద్యోగం పోయి ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్ రవికుమార్ మూడ్రోజుల క్రితం సూసైడ్ చేసుకోగా.. గురువారం ఆయన భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో జరిగింది. వెన్నం రవికుమార్ (35), అంజలి (31) భార్యాభర్తలు. రవికుమార్ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేసేవాడు. అయితే కరోనా వల్ల స్కూళ్లు బంజేయడంతో ఉపాధి లేక రోడ్డున పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 6న ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణంతో మనస్తాపానికి గురైన అంజలి.. గురువారం మాచర్ల కుడి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారి పిల్లలు సాక్షి (4), సందేశ్ (6) అనాథలయ్యారు.
పిల్లలను దత్తత తీసుకుంటా: రఘువీర్ రెడ్డి
తల్లిదండ్రుల ఆత్మహత్యతో అనాథలైన చిన్నారులను దత్తత తీసుకుంటానని జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి చెప్పారు. పిల్లలకు చదువు, వసతి సౌకర్యాలను కల్పిస్తానని.. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని తెలిపారు. నిరుద్యోగులు, ప్రైవేట్ టీచర్లు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని
ఆరోపించారు.