రామాలయం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి : ప్రియాంక అల

రామాలయం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి :  ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి టెంపుల్​ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని అధికారులను కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో పలు శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. టెంపుల్​ డెవలప్​మెంట్​లో భాగంగా అవసరమైన భూ సేకరణకు నివేధికలను సిద్ధం చేసి మూడు రోజుల్లోపు అందజేయాలని ఆమె సూచించారు.

భూ నిర్వాసితులకు ఆర్​ అండ్​ ఆర్​ ప్యాకేజీ ద్వారా ఇవ్వాల్సిన అనుకూలమైన ల్యాండ్​ను గుర్తించాలన్నారు. భద్రాచలం రామాలయం భూములకు సంబంధించి పెండింగ్​లో ఉన్న కోర్టు కేసుల వివరాలను అందజేయాలని చెప్పారు. ఈ మీటింగ్​లో ఐటీడీఏ పీఓ ప్రతీక్​ జైన్, అడిషనల్​కలెక్టర్​ వేణుగోపాల్, ఏపీఓ జనరల్​ డేవిడ్​రాజ్, తహసీల్దార్​శ్రీనివాస్, కొలతలు–సర్వే ఏడీ కుసుమకుమారి, డిప్యూటీ సీఈఓ చంద్రశేఖర్, కలెక్టరేట్​ భూ సేకరణ సీనియర్​అసిస్టెంట్​యాసిన్​ పాషా 
పాల్గొన్నారు. 

తాగు నీటి ఎద్దడి నివారణ చర్యలు 

వేసవిలో గ్రామాల్లో తాగు నీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్​ ఆదేశించారు. కలెక్టరేట్​లో పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆళ్లపల్లి, పూసుకుంట, కరకగూడెం లాంటి మారుమూల గ్రామాల్లోనూ తాగునీటి ఎద్దడి ఉండకూడదన్నారు. 634 మంది ఆర్​ఓఎఫ్​ఆర్​ పట్టాలున్న వారికి బోర్లు వేసుకునేందుకు పర్మిషన్​ ఇచ్చామని చెప్పారు. బూర్గంపహడ్​ మండలం సారపాకలో భాస్కర్​ నగర్​ రోడ్డుకు సంబంధించి ఫామ్​ బి రిపోర్టు ఇవ్వాలని డీఎఫ్​ఓను ఆదేశించారు.