బదోహిలో ప్రియాంక పర్యటన

బదోహిలో ప్రియాంక పర్యటన

70 ఏళ్లలో ఏం చేశారన్న ప్రశ్న అవుట్ డేటెడ్ అన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఈ ఐదేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు ప్రియాంక. గంగాయాత్రలో భాగంగా రెండో రోజు పర్యటన మొదలు పెట్టారు. గంగానది పరివాహక గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని బదోహిలో పర్యటించారు. రెండేళ్ల పాలనపై యోగి ఆదిత్యనాథ్ రిపోర్ట్ కార్డ్ మాటల్లో బాగానే ఉందని, అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు ప్రియాంక గాంధీ. బీజేపీ పాలనపై జనమంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. బదోహిలోని ఆలయంలో పూజలు చేశారు ప్రియాంక.