మేం గెలిస్తే.. కాలేజ్ అమ్మాయిలకు స్మార్ట్‌ఫోన్లు, స్కూటీలు

మేం గెలిస్తే.. కాలేజ్ అమ్మాయిలకు స్మార్ట్‌ఫోన్లు, స్కూటీలు

ఉత్తరప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తే ఇంటర్  అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యుయేట్లకు  ఎలక్ట్రానిక్  స్కూటీలు ఇస్తామని చెప్పారు AICC జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. పేద కుటుంబాలకు ఏటా 25 వేల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. కరోనా కాలానికి సంబంధించిన కరెంట్ బిల్లులు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని, వరిధాన్యం, గోదుమలకు రూ.2500  మద్దతు ధర చెల్లిస్తామని.. ఇవి తమ మేనిఫెస్టోలోని అంశాలని చెప్పారు ప్రియాంకగాంధీ. యూపీలోని బారాబంకి వెళ్లిన ఆమె.. మహిళా రైతులతో ముచ్చటించారు. వారితో కలిసి లంచ్ చేశారు.