
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. రేపు శ్యామ్ సుందర్ రెడ్డి అంత్యక్రియల ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి. శ్యామ్ సుందర్ రెడ్డి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు .