1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం వంటి అవార్డు చిత్రాలను తెరకెక్కించిన నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘1920 భీమునిపట్నం’. భారత స్వాతంత్ర్యోద్యమం బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో కంచర్ల ఉపేంద్ర హీరోగా నటిస్తున్నాడు. అపర్ణా దేవి హీరోయిన్. కంచర్ల అచ్యుతరావు నిర్మాత.
శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో షూట్ చేస్తున్నట్టు టీమ్ తెలియజేసింది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పదిరోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనుందని చెప్పారు.
ఈ చిత్రంలోని సీతారాం, సుజాత పాత్రల మధ్య నడిచే ప్రేమకథ దర్శకుడు నరసింహ నంది అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని నిర్మాత తెలియజేశారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.