న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)కు తప్పుడు సమాచారంతో అనుమతులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. నిమ్జ్ భూసేకరణలో 90 శాతం వ్యవసాయ భూమి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతమే వ్యవసాయానికి వినియోగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందన్నారు. నిమ్జ్ భూసేకరణ, తప్పుడు నివేదికపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కు కోదండరాం ఫిర్యాదు చేశారు. గురువారం ఢిల్లీలో భూనిర్వాసితుల సంఘం నేతలు ఆశప్ప, రాఘవరెడ్డితో కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. భూ దోపిడీ, భూ నిర్వాసితుల కష్టాలను కేంద్ర మంత్రికి వివరించామని ఆయన చెప్పారు. నిమ్జ్ పేరిట 12,630 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందని, దీంతో 22 గ్రామాలు బతుకుదెరువును కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్ల విలువ చేసే భూముల్ని రూ.10 లక్షల నామమాత్రపు రేటుకు గుంజుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. 12 వేల ఎకరాల్లో 4,200 ఎకరాలే పరిశ్రమలకు వాడతారని.. రిక్రియేషన్, పార్క్ ల కోసం మిగతా 7,800 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. పారిశ్రామికవాడల కోసం 10 శాతం కన్నా తక్కువగా సాగవుతున్న వ్యవసాయ భూముల్ని తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం పంట సాగవుతున్న భూముల్ని లాక్కుంటోందని ఆరోపించారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కోదండరాం చెప్పారు. రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా భూముల్ని లాక్కుంటోందని భూ నిర్వాసితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశప్ప ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ భవన్ లో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కోదండరాం పూలమాల వేసి నివాళులర్పించారు.
భూసేకరణపై కేంద్రానికి రాష్ట్ర సర్కారు తప్పుడు నివేదికలు
- తెలంగాణం
- April 15, 2022
లేటెస్ట్
- KKR vs SRH: హెడ్, అభిషేక్ శర్మ ఔట్.. కష్టాల్లో సన్రైజర్స్
- లోక్సభ ఎలక్షన్లపై..ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
- 3 నిమిషాల్లోనే 6 వేల అడుగులకు పడిపోయిన విమానం..అసలేం జరిగిందంటే.?
- KKR vs SRH: సన్రైజర్స్ బ్యాటింగ్.. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్
- Allu Arjun: సింప్లిసిటీ అంటే ఇది..రోడ్డు పక్కన దాబాలో భార్యతో కలిసి అల్లు అర్జున్ భోజనం..ఎక్కడంటే?
- T20 World Cup 2024: మెంటార్గా అతడే సరైనోడు: వెస్టిండీస్ దిగ్గజంపై పాక్ క్రికెట్ బోర్డు కన్ను
- Deepthi Jeevanji: ప్రపంచ పారా అథ్లెటిక్స్లో తెలంగాణ యువతికి గోల్డ్ మెడల్
- ఈ గుడిలో పెళ్లికి ముహూర్తం అవసరం లేదు.. ఎప్పుడైనా.. ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు..
- Indian2 SOURAA Promo: ఇండియన్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్..తెలుగు లిరిక్స్ అందించింది ఎవరంటే?
- కరెంట్ ఆదా చేసే 5 రకాల ఇన్వర్టర్ ఫ్యాన్లు
Most Read News
- Devara Fear Song Lyrics: దేవర ఫియర్ సాంగ్ లిరిక్స్పై నెటిజన్స్ విమర్శలు..పూర్తి లిరిక్స్ చూశారా?
- వచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్సీఏ అధ్యక్షుడు
- హైదరాబాద్లో ఒకేసారి ఆరు చోట్ల ACB రైడ్స్
- SRH vs KKR: కోల్కతాతో క్వాలిఫయర్ 1.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పులు
- సన్న వడ్లకు రూ.500 బోనస్
- బెంగళూరులో రేవ్ పార్టీ.. 8 మంది అరెస్టు, అదుపులో మరో 78 మంది
- రిటైర్డ్ అవుతున్న జడ్జ్ వివాదాస్పద కామెంట్స్
- Video Viral: వామ్మో.. వీడు మామూలోడు కాదుగా.. బీజేపీకి 8 సార్లు ఓటేశాడు..
- Naga Chaitanya: అత్యంత ఖరీదైన కారు కొన్న నాగ చైతన్య.. స్పెషాలిటీస్ ఇవే?
- కెమికల్స్తో పండించిన మామిడిపండ్లు తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా.. వాటిని ఎలా గుర్తించాలి....